Header Banner

కుంభమేళాలో పుణ్య స్నానం కోసం పది కిలోమీటర్లు నడిచిన ఎంపీ! అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్!

  Thu Feb 13, 2025 13:58        Politics

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధిగా తనకున్న ప్రత్యేక ప్రొటోకాల్ ను కాదనుకుని సామాన్యుడిలా అనుచరులతో కలిసి 10 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. ఎంపీ ఈటల మిగతా భక్తులతో కలిసి నడుస్తున్న వీడియోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈటల రాజేందర్ వెంట మాజీ ఎంపీ బీబీ పాటిల్ తో పాటు అనుచరులు ఉన్నారు. కాలినడకన త్రివేణి సంగమానికి చేరుకున్న ఎంపీ ఈటల, బీబీ పాటిల్ పుణ్య స్నానం ఆచరించారు. స్థానిక పూజారులు ఎంపీ ఈటల బృందంతో పూజలు చేయించారు. బుధవారం మాఘ పూర్ణిమ కావడంతో ప్రయాగ్ రాజ్ కు భక్తులు పోటెత్తారు.

 

ఇది కూడా చదవండి: మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!

 

ఇటీవలి తొక్కిసలాట నేపథ్యంలో యూపీ అధికారులు ప్రయాగ్ రాజ్ ను నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. కుంభమేళా ముగింపు దగ్గరపడుతుండడంతో ప్రయాగ్ రాజ్ కు భక్తుల తాకిడి పెరిగింది. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు. ఈ నెల 26న మహాశివరాత్రితో మహా కుంభమేళ ముగియనుంది. చివరిరోజు సుమారు 5 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందనే అంచనాలతో యూపీ సర్కారు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తుంది.

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!

 

ప‌వ‌న్ నుంచి ఈ ల‌క్ష‌ణాన్ని తాను కూడా అల‌వాటు చేసుకోవాల‌న్న హీరోయిన్‌! సోషల్ మీడియా లో వైరల్!

 

శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!

 

నేడు (13/2) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #MalkajgiriBJPMP #EtalaRajender #PrayagRaj #KumbhMela #TriveniSangam